
హెచ్.ఆర్.సి.ఐ. నూతన జాతీయ ఉపాధ్యక్షుడిగా బి. తిరుమలరావు ఎంపిక…
మన గుంతకల్లున్యూస్,
ఫిబ్రవరి 2 గుంతకల్లు.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ నూతన జాతీయ ఉపాధ్యక్షుడిగా బి. తిరుమలరావుకు పదోన్నతి కల్పిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాలుగా ఎంపిక జరిగినట్లు జాతీయ ప్రథమ ప్రధాన కార్యదర్శి మాదాసు చారేంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సదరు ప్రకటనలో ఆయన తెలిపిన వివరాల మేరకు హెచ్.ఆర్.సి.ఐ. సంస్థ జాతీయ ఉపాధ్యక్షునిగా నూతనంగా ఎంపికైన బి.తిరుమలరావు తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఆర్సీఐ రాష్ట్ర అధ్యక్షుడుగా విధులను నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా తనవంతు కృషిగా ఉత్తమ సేవలను అందించి అందరిచే మన్ననలను పొందడం అభినందనీయమన్నారు. సదరు సేవల పట్ల ఆయన సేవలకు గుర్తింపునిస్తూ జాతీయ కార్యవర్గంలో పదోన్నతిగా స్థానం కల్పిస్తూ నియామకపు ఉత్తర్వులు అందాయన్నారు. జాతీయ కార్యవర్గంలో మరింత మెరుగైన సేవలు అందించే అవకాశమును ఆయన సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ పదోన్నతి పట్ల శుభాకాంక్షలు అందజేస్తున్నామన్నారు. హెచ్ఆర్సీఐ కుటుంబ సభ్యులందరూ మీ వంతు సహకారంగా సంస్థ అభివృద్ధి పథంలో నడిచేందుకు వీలుగా ప్రజా సమస్యల పట్ల బాధ్యతతో బాధితులకు సహాయకులుగా సేవలతో అండగా నిలిచి సంస్థ ప్రతిష్టతో కూడిన మనుగడకు దోహదపడాలని జాతీయ అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారన్నారు.