
‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా
:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి ఫిబ్రవరి 3.
మన గుంతకల్ న్యూస్
విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నాం. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, మా ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, మార్చి 12వ తేదీన ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించాం.
–వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి.